Take a fresh look at your lifestyle.

పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికీ 45 మంది అరెస్ట్

0 11

పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికీ 45 మంది అరెస్ట్

హైదరాబాద్, మే 28 : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కొత్త కోణం. ఇప్పటివరకు 45 మంది నిందితులు అరెస్ట్‌. తాజాగా తెరపైకి వచ్చిన వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు. సదరు విద్యుత్ శాఖ డీఈ కనుసున్నల్లో పెద్ద ఎత్తున ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిషోర్ అరెస్ట్ చేసిన సిట్!
టీఎస్పీఎస్సి బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో నిందితున్ని అరెస్ట్ చేసారు.

దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నలభై అయుదుకు పెరిగింది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్న రమేష్. ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాలను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రవికిషోర్ నుంచి కొన్నట్టుగా సిట్ విచారణలో తేలింది. ఈ క్రమంలో రమేష్ ను సిట్ అధికారులు వరంగల్ లో అరెస్ట్ చేసారు. రమేష్ ను జరిపిన విచారణలో అతను ఈ ప్రశ్నా పత్రాలను మరో ఇరవై మందికి అమ్మినట్టుగా వెళ్లడయ్యింది. వీరి వివరాలను సేకరించిన సిట్ అధికారులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేసారు.
▫️▫️▫️▫️

Leave A Reply

Your email address will not be published.

Breaking