Take a fresh look at your lifestyle.

భారత్ బంద్ విజయవంతం చేయండి

0 55

సిద్దిపేట జిల్లా దళిత,గిరిజన, ప్రజా సంఘాల జె ఏ సీ పిలుపు ఇటీవల కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దళిత, గిరిజన ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు.సిద్దిపేట జిల్లా జె ఏ సీ కన్వీనర్ భీమసేన, కో కన్వీనర్ల్ కరికే శ్రీనివాస్, వనం రమేష్ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశం మాట్లాడుతూ విద్యుత్తు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించనున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు దళిత గిరిజన బహుజన, మైనారిటీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు జర్నలిస్టు సంఘాలు, మేధావులు, ఈ పోరాటానికి మద్దతుగా నిలిచి బంద్ కార్యక్రమంలో పాల్గొనాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. భారత్ బంద్ విస్తృత సమావేశం నిర్వహించి మీడియాకు వెల్లడించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పొన్నాల కుమార్,న్యాయవాది శ్రీనివాస్, సడిమేల కనుకయ్య,మెరుగు మహేష్, ధబ్బేట కనుకయ్య,బోధసు యాదగిరి తదితరులుపాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్..

Leave A Reply

Your email address will not be published.

Breaking