Take a fresh look at your lifestyle.

పోలీస్ బాస్ రంగనాథ్ ప్లెక్సి కి పాలభిషేకం..

0 411

సీపీ ఫ్లెక్సీకీ రైతులు క్షీరాభిషేకం

పేదలకు సంతోషం వచ్చినా.. బాధలు వచ్చినా లోన ఏమి ఉంచుకోరు.. ఇగో ఈ దంపతులు కూడా అంతే.. పోలీసు బాస్ రంగనాథ్ తమకు న్యాయం చేసారని స్వయంగా పాలభిషేకం చేశారు. 

 వరంగల్, మార్చి 17 :  న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి , రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల భూమి ఉండగా, అందులో నుంచి ఇరవై గుంటల భూమిని ఏనుగుల తండాకు చెందిన ఎస్ బీ ఐ ఉద్యోగి బానోతు అనిల్ నాయక్ భార్యకు, బానోతు సునీల్ నాయక్ కు 2018 లో అమ్మినట్లు తెలిపారు.

అప్పటి నుంచి ఎవరి హద్దుల్లో వాళ్ళమే ఉంటున్నామన్నారు. అయితే, కొద్ది కాలం నుంచి మరో పది గుంటల భూమిని అమ్మాలని అనిల్ నాయక్, సునీల్ నాయక్ తమను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు జీవనోపాధిగా ఉన్న భూమిని అమ్మబోమని చెప్పగా, అప్పటి నుంచి తమను అనిల్ నాయక్, సునీల్ నాయక్ మరి కొంత మందితో కలిసి బెదిరించడంతో పాటు, తమ పొలాన్ని ధ్వంసం చేశారని, హద్దు రాళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తామే వారిని కులం పేరుతో దూషించామని మాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ గారికి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పామన్నారు. దీంత

Leave A Reply

Your email address will not be published.

Breaking