Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై చార్జ్ షీట్

0 41

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై

చార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్

  • ఆది శ్రీనివాస్, సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు

వేములవాడ : చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెంకబడిందని, ఎమ్మెల్యే వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేస్తున్నాం అన్నారు సిరిసిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్. 500 కోట్లతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మోసం చేశారన్నారు ఆయన. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారని విమర్శించారు.

వేములవాడలో తాగునీటికి కటకట ఉన్నా.. సమస్యను తీర్చడం లేదన్నారు ఆది శ్రీనివాస్. తిప్పాపూర్ బస్టాండ్ ను కూల్చి కావాలనే వేరేచోట నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు ఆయన. నియోజకవర్గంలో బాలికలకు జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని దుయ్యబట్టారు ఆయన.

2018లో దసరాకు రైతులకు నీళ్లు ఇస్తామన్న హరీష్ హామీ ఏమైందని ప్రశ్నించారు శ్రీనివాస్. అయిదు దసరాలు గడిచినా నెరవేరలేదని పేర్కొన్నారు. అటవీ అనుమతులు లేక రోడ్డు పనులు నిలిచిపోయినా పట్టించుకోవడంలేదన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదని, నాంపల్లి పల్ల గుట్ట ప్రాంతంలో పేదలకు కాంగ్రెస్ పంచిన భూములను ధరణి పేరుతో ప్రభుత్వం గుంజుకుందన్నారు ఆయన.

10నెలల్లో ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.  లేకపోతే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఆది శ్రీనివాస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking