Take a fresh look at your lifestyle.

పోలీసు కస్టడీలో టీఎస్పిఎస్సి నిందితులు

0 277

పోలీసు కస్టడీలో టీఎస్పిఎస్సి నిందితులు

హైదరాబాద్, మార్చి 18 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల  కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు కస్టడీ కి తీసుకున్నారు. ఏ -1 ప్రవీణ్ కుమార్, ఏ -2 అట్ల రాజశేఖర్, ఏ -3 రేణుక రాథోడ్, ఏ -4 డాక్య, ఏ- 5 కేతావత్ రాజేశ్వర్, ఏ -6 కేతావత్ నీలేష్ నాయక్, ఏ -7 పత్లావత్ గోపాల్ నాయక్, ఏ -8 కేతావత్ శ్రీనివాస్, ఏ -9 కేతావత్ రాజేంద్ర నాయక్ లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది నిందితులను ఆరు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీ అనుమతి ఇచ్చింది. చంచల్ గూడా జైలు నుండి నిందితులను సిట్ బృందం కస్టడీ లోకి తీసుకున్నారు. వారిని ఆరు రోజుల పాటు విచారించునున్నారు. పోలీసులు పేపర్ లీకేజ్ వ్యవహారం లో నిందితుల ఆర్థిక లావాదేవీల ఫై కూపి లాగుతున్నారు. ప్రశ్న పత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking