Take a fresh look at your lifestyle.

మేడారంకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

0 15

మేడారంకు ప్రత్యేక బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నిర్దేశం, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్స్ లో సమ్మక్క సారళమ్మ
మేడారం జాతరకు వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన
ప్రత్యేక ఆర్టీసీ బస్సులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం మేడారం జాతరకు వెళ్ళే భక్తుల రవాణా
అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ మన పెద్దపల్లి నుండి 200 ప్రత్యేక
ఆర్టీసీ బస్సులను నడుపుతుందని అన్నారు. . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మేడారం జాతరకు
కూడా వర్తిస్తుందని…. ఆడపడుచులందరూ ఉచితంగా మేడారం జాతరకు వెళ్లి ఆ
సమ్మక్క సారలమ్మ దీవెనలను స్వీకరించాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking