Take a fresh look at your lifestyle.

రెండు గంటల్లో రెండు కిడ్నాప్ లను చేదించిన పోలీసులు

0 17

ఇద్దరు పిల్లలను కిడ్నాప్ నుంచి రక్షించిన పోలీసులు

సికింద్రాబాద్, జూన్ 4 :పోలీసులు స్పందిస్తే నేరాల సంఖ్య తగ్గుతాయి. నిర్లక్ష్యం చేస్తే ఆ నేరాలు పెరుగడమే కాకుండా హింసత్మక సంఘటనలు జరుగుతాయి. ఇగో.. మహంకాళి పోలీసులు రెండు గంటల వ్యవదిలో రెండు కిడ్నాప్ కేసులను చేధించి తమ సత్తా చాటారు.

మహంకాళి, సుల్తాన్ బజార్ లిమిట్స్ లో ఇద్దరు పిల్లలను ఆటో లో ఎత్తుకువెళ్లిన ఇద్దరిని కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వెంటనే గుర్తించారు. సీసీ వీడియో ల ఆధారంగా ఆటో డ్రైవర్ ఇమ్రాన్, ప్రవీణ అనే మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ చేసిన పిల్లలను డీసీపీ చందన దీప్తి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ ఇద్దరు పసి పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతారని పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking