Take a fresh look at your lifestyle.

0 132

తొమ్మిది మంది దుర్మరణం

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు.

ఒకరు గాయపడ్డారు. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబయి-గోవా రహదారిపై గురువారం ఉదయం లారీ, వ్యాన్ ఢీకొన్నాయి.

9మంది అక్కడికక్కడే మరణించినట్లు తెలిసింది.

మృతుల్లో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.

మరో చిన్నారికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking