Take a fresh look at your lifestyle.

 పోలీసులు కట్టు బానిసలా పని చేయద్దు

0 48

 పోలీసులు కట్టు బానిసలా పని చేయద్దు

: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 5 (వైడ్ న్యూస్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంఘటనపై  తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

 కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని డీపీజీని ప్రశ్నించారుఆయన. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని సమాధానమిచ్చారు డీజీపీ. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు ఆయన. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులను కోరారు కిషన్ రెడ్డి. 

Leave A Reply

Your email address will not be published.

Breaking