Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

0 13

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు

కోరుట్ల, మే 22 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు గాయలైన సంఘటన మండలంలోని వెంకటాపూర్ స్టేజీ వద్ద చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే మేడిపల్లి మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన పంచతీ హనుమండ్లు(55) తోపాటు రాజం (54 )తన వ్యక్తిగత పనుల కోసం సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై కోరుట్ల కు బయలుదేరారు.

ఈ క్రమంలో వెంకటాపూర్ స్టేజ్ వద్ద ద్విచక్ర వాహనంతో రోడ్డు క్రాస్ చేస్తుండగా, జగిత్యాల నుంచి ముంబై కి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా గుద్దింది.. బలంగా గుద్దడంతో హనుమండ్లు తలకు తీవ్ర గాయాలు కాగా అతను అక్కడిక్కడే మృతి చెందాడు..అలాగే ద్విచక్ర వాహనంపై వెనుక సీట్లో ఉన్న రాజం కు తీవ్ర గాయాలు పాలయ్యాడు.దీంతో అతనికి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ఎస్సై సతీష్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking