Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ లో ‘‘మట్టికథ’’ ప్రీమియర్ షో ప్రధర్శన

0 12

ఆర్మూర్ లో ‘‘మట్టికథ’’ ప్రీమియర్ షో ప్రధర్శన

సినీహీరో అజయ్ వెద్ కు సన్మానం

నిర్దేశం, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ముద్దుబిడ్డ సినీ హీరో అజయ్ వేద్ కథ నాయకుడిగా నటించిన ‘‘మట్టికథ’’ ప్రీమియర్ షో ను గురువారం ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మహాల్ లో ప్రదర్శించారు.

ఈ ‘‘మట్టికథ’’ సినామాకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు అవార్డులు సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలోని పోరి – పోరడి లవ్ కథనే ఈ మట్టికథలో చూపించారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సినీ హీరో అజయ్ వెద్ ను IIHFW తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ సన్మానించారు.

 

చేయూత సేవా సంస్థ అధ్యక్షులు మానస గణేష్  గారి కుమారుడు  సినీహీరో అజయ్ వేద్ కథానాయకుడిగా నటించిన మట్టి కథ చిత్ర యూనిట్ నేడు ఆర్మూర్ లో హల్ చల్ చేసింది. మట్టికథ చిత్రం నిర్మాత అప్పి రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ శ్రీనివాస రావు,  మై టీవీ సిఈఓ సతీష్ లను చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు సన్మానించారు.

నటించిన మొదటి చిత్రంలోని అవార్డు రావడం అభినందనీయమన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్  మధు శేఖర్. ఈ సన్మాన కార్యక్రమంలో  చిత్ర యూనిట్ తో పాటు రైతు కూలీ సంఘం నాయకులు వి. ప్రభాకర్,  డాక్టర్ నాగరాజు, డాక్టర్ లింగారెడ్డి, సీనియర్ రిపోర్టర్ నర్సింహాచారి, కాంతి గంగారెడ్, ఐడియా సాగర్, కథానాయకుడు అజయ్ వేద్ తల్లిదండ్రులు శ్రీమతి పద్మ మానస గణేష్, సోదరి డాక్టర్ మానస, చేయూత ప్రతినిధులు కలిగోట గంగాధర్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కొక్కెర భూమన్, బిఆర్ఎస్ నాయకులు షేట్పల్లి నారాయణ, ఎం జె రాజు , మునిపల్లి రవి, ఎంజె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking