Take a fresh look at your lifestyle.

జై తెలంగాణ నినాదాలు ఇచ్చిన మీరా కుమార్

0 13

 జై తెలంగాణ నినాదాలు ఇచ్చిన

లోక్ సభ మాజీ స్పీకర్  మీరా కుమార్

హైదరాబాద్, జూన్ 2 : జై తెలంగాణ అని గట్టిగా నినదిద్దాం. నాకు తెలుగులో మాట్లాడాలని ఉంది. తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది. మా నాన్న ఇక్కడికి వచ్చేవారు. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉందని పేర్కొన్నారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పొల్గొన్నారు ఆమె.

తెలంగాణ ప్రజల బాధ అర్థం చేసుకున్న సోనియాకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారు. తెలంగాణ సమస్య ఎవరు వినలేదు. సోనియా మాత్రం తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారన్నారు మీరా కుమార్. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేశాం. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ ఏర్పాటు చేశాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం హాస్యాస్పదం.తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడిచినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఆమె.

తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఖంగా ఉంది. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్ నుండి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయి. తెలంగాణలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారు. తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్నారు ఆమె.

అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలనేది కాంగ్రెస్ ఆలోచన. మీరు ఎప్పుడు పిలిచినా ఒక కాల్ చేయగానే నేను తెలంగాణకి వచ్చేస్తా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీరా కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking