Take a fresh look at your lifestyle.

జగన్ జైల్ కు వెళ్లడం ఖాయం : టీడీపీ నేత నారా లోకేష్

0 14

రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం కే సాధ్యం
జగన్ జైల్ కు వెళ్లడం ఖాయం

2024 లో గెలిచేది తెలుగుదేశమే
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్

నందవరం, ఏప్రిల్ 28 : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర లో అభివృద్దే మన బలం అన్నారు.యువగలం పాదయాత్ర శుక్రవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం లోకి అడుగుపెటింది. ఇబ్రహీంపురం,కొట్టాల,మాచపురం గ్రామాల మీదుగా నందవరం చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది.పొలాల్లో పనిచేస్తున్నటువంటి రైతులను లోకేష్ పలకరిస్తు రైతులు పడుతున్న ఇబందులను ఆరా తీసి మీ సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు.భోజన విరామ సమయంలో మాచపురం గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన రైతుల తో ముఖాముఖీ నిర్వహించారు.

మండలంలో వివిధ గ్రామాల రైతులు,ప్రజలు ఎదుర్కొంటున్న సాగు,తాగునీటి,నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల సమస్యలను పరిష్కరించాలని కోరాగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేస్తామని తెలిపారు.మోటర్లకు మీటర్లు బిగించి రైతులను నిలువునా మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని సాగనంపుదాము అని పిలుపునిచ్చారు.ఒక పక్క సంక్షేమం అంటూ మరో పక్క ధరలు పెంచి అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడని ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయాని  త్వరలో జగన్ జైల్ కు పోవడం ఖాయమని చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్ర కు జన నీరాజనం పట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking