దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్య క్రమానికి 7 దేశాల అధినేతలు, CJI జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు, పవన్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి…
ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ. ప్రధానిగా మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన మోడీ. కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్..
72 మందితో మోడీ కేబినెట్.. 30 మంది కేబినెట్ మంత్రులు.. ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయమంత్రులు.. కేబినెట్లో 27 మంది ఓబీసీ, ఎస్సీలు-10, ఎస్టీలు-5.. ఐదుగురు మైనార్టీలకు మంత్రి పదవులు.. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు.