Take a fresh look at your lifestyle.

భువనగిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఐటీ సోదాలు

0 17

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల ఆఫీసు,

కార్యాలయంలో ఐటీ సోదాలు

హైదరాబాద్ , జూన్ 14 : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వీళ్లిద్దరి కంపెనీల్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు మరోసారి హీట్‌ ఎక్కింది. గురువారం అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ టైంలో సడెన్‌గా జరిగిన ఐటీ రైడ్స్‌ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్‌లు, వారి బంధువుల, సహచరుల నివాసాలపై కూడా ఐటీ కన్నేసింది. ఈ ఉదయం నుంచి మూకుమ్మడిగా సైలెంట్‌గా అధికారులు అటాక్ చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు ప్రజాపతినిధులపై జరుగుతున్న ఐటీ రైడ్స్‌ తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్నారు.

ఆయన ఇంట్లో వేకువజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉంటున్నారు. ఆయన ఇంటితోపాటు ఆఫీసుల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పైళ్ల శేఖర్‌ రెడ్డి యాదాద్రి జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నివాసం, కంపెనీల్లో కూడా తనిఖీలు చేపట్టింది ఐటీ శాఖ. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని ఆఫీస్‌, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లతోపాటు మొత్తం 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే నివాసాలు, బంధువుల ఇళ్లు, ఆఫీస్‌లపై సోదాల కోసమే 30 టీంలు పని చేస్తున్నాయి. మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చెందిన షాపింగ్ మాల్‌పై ఐటీ శాఖ గురిపెట్టింది. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీశాఖ రైడ్స్ చేసింది. ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హిల్‌ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌లో సహా పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

మొత్తం 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. 12 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి.అలాగే శేఖర్ రెడ్డి సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు.ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి భార్య వనితా హిల్‌ ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్తపేట, గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కార్యాలయాలతో పాటు భువనగిరిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ జాయింట్ కమిషనర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు చేస్తున్నారు.

దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి. హైదరాబాద్‌తో పాటు కర్నాటకలో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికాలోనూ తీర్థ గ్రూప్ మైనింగ్ వ్యాపారం చేస్తోంది. దీంతో ఐటీ అధికారులు ఐటీ చెల్లింపుల అవకతవకలపై ఆరా తీస్తున్నారు.శేఖర్ రెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడులతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఈ తనిఖీలతో టెన్షన్ మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking