Take a fresh look at your lifestyle.

చికోటి ప్రవీణ్ పాలిటిక్స్‌లోకి రాబోతున్నారా..?

0 53

ఏ గూటికి చీకోటి వెళుతున్నారు…?

హైదరాబాద్, ఫిబ్రవరి 23, తెలంగాణలో సంచనలం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ పాలిటిక్స్‌లోకి రాబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ లో చేరబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై చికోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హిందుత్వం గురించి మాట్లాడితే.. బీజేపీలో చేరబోతున్నావా ? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారని.., ఈడీ రైడ్లు చేయించి తనను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హిందుత్వం అనేది తన రక్తంలోనే ఉందని అన్నారు. ఒకవేళ పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సి వస్తే.. బీజేపీలో చేరతానంటూ కీలక కామెంట్స్ చేశారు. “హిందుత్వం నా రక్తంలోనే ఉంది. హిందువుగానే పుట్టా. హిందువుగానే చస్తా. ఒకవేళ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వస్తే.. బీజేపీ వైపు స్టాండ్ తీసుకుంటా” అంటూ వ్యాఖ్యనించారు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీలో చేరతానంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాఫిక్‌గా మారాయి. అయితే చికోటి ప్రవీణ్ కామెంట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క్యాసినో కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీ పాట పాడుతున్నారని కొందరు మండిపడుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరినా వచ్చే లాభమేం లేదని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.చికోటి ప్రవీణ్, ఆయన సన్నిహితుడు మాధవరెడ్డి టూర్ ఆపరేటర్లుగా వ్యవహరిస్తూ క్యాసినో వ్యాపారంలో ఉన్నారు. గోవా, నేపాల్ లాంటి ప్రాంతాల్లో క్యాసినో చట్టబద్ధం కావడంతో అక్కడ ఈ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. అక్కడికి తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులను తీసుకెళ్లడం, వారితో జరిపిన లావాదేవీలపై ఈడీ విచారణ చేపట్టింది.

గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. చాలా మంది ప్రముఖులు వీరితో టచ్‌లో ఉన్నట్లు గుర్తించింది.ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈకేసులో ఇప్పటికే చికోటి ప్రవీణ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, వారి సన్నిహితులు, వ్యాపారవేత్తలను ఈడీ విచారించింది. దాంతో పాటు చికోటి ప్రవీణ్ హైదరాబాద్ నగర శివారులోని తన ఫామ్‌హౌస్‌లో అరుదైన జంతువులను అక్రమంగా పెంచుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అటవీ అధికారులు కేసులు సైతం నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking