Take a fresh look at your lifestyle.

ఈ పోలీసు అధికారి చేసిన పని చూస్తే…

0 71

గంజాయి కారులో డీఎస్పీ ఎంజాయ్

నెంబరు ప్లేటు మార్చి కుటుంబ సభ్యులతో షికారు

అనకాపల్లి జిల్లా  :  అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో గత ఏడాది జులైలో గంజాయి తరలిస్తున్న నిందితులు కొందరు పోలీసులను చూసి కారు వదిలి పారిపోయారు. కశింకోట పోలీసులు ఆ కారు (ఏపీ31 బీఎన్ 1116)ను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అది జి.మాడుగులకు చెందిన సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టరై ఉంది. రాజస్థాన్ కు చెందిన సింగ్ అనే వ్యక్తి జి.మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు తేలింది.

పోలీసులు పిలవడంతో గతేడాది నవంబరు 11న అతడు కశింకోట స్టేషన్కు వచ్చాడు. విచారించి అతడిని అరెస్టు చేశారు. అతడు తాను వేసుకువచ్చిన కారును తన తల్లికి అప్పగించాలని కోరాడు. అయితే ఆమె రాజస్థాన్ వెళ్లిపోయారని ఆ తెలిసి ఆ కారును అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అప్పటి నుంచి పోలీసులు దానిని తమ అవసరాలకు వాడు కుంటున్నారు. ఈ క్రమం లోనే ఈనెల 1న డీఎస్పీ సునీల్ కుటుంబసభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో మొత్తం వ్యవహారం వ్యవహారం బయటపడింది. అయితే ప్రమాదంపై డీఎస్పీ, అవతలి వ్యక్తి రాజీ పడటంతో కేసు నమోదు కాలేదు. డీఎస్పీ వ్యవహారంపై అనకాపల్లి ఎస్పీ గౌతమిని వివరణ కోరగా.. ‘డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడిన నిందితుడు సింగ్ కారులో ప్రయాణించి నట్లు మా దృష్టికి వచ్చింది. నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే.. నంబరు ప్లేట్ మార్చడం మరో నేరంగా భావించిన ఉన్నతా ధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై నివేది కను వారికి పంపుతామని తెలిపారు.

డీఎస్పీ సునీల్ పై గతంలోనూ వివాదాలున్నాయి. సివిల్ కేసుల్లో తలదూరుస్తారని, భూవి వాదాలు సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కశింకోటకు చెందిన తెదేపా నాయ కుడు కాయల మురళిని ఫోన్లో బెదిరించా రంటూ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎస్పీ గౌతమికి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking