Take a fresh look at your lifestyle.

నలుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

0 11

భద్రాచలం జిల్లాలో నలుగురు

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

భద్రాచలం జిల్లా:ఆగస్టు 12 : నలుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. స్థానిక ఏ ఎస్ పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన మావోయిస్టు కొరియర్ల వివరాలు వెల్లడించారు.

పోలీస్లు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దుమ్ముగూడెం మండలంలోని గౌరారం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా,పైడిగూడెం నుండి నల్లబెల్లి సెంటర్ వైపు వెళ్తున్న కారు పోలీసులు ఆపినా ఆగకుండా వెళ్లింది. దాంతో కారును వెంబడించి పట్టకున్నారు.

అందులోని వ్యక్తులను ప్రశ్నించగా మావోయిస్టు కొరియర్లు గా పనిచేస్తున్నట్లు ఒప్పుకోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

అలాగే పట్టుబడిన వారి వద్ద నుండి 20 లక్షల నగదు తో పాటు తూటాలు, డిటోనేటర్, కారు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking