Take a fresh look at your lifestyle.

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక భద్రత

0 71

బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక భద్రత

హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయిన కానిస్టేబుల్ శేఖర్ బార్య, పిల్లలకు రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్ చేతుల మీదుగా భద్రత ఎక్స్ గ్రేషియ 8 లక్షల చెక్కులను శేఖర్ బార్య హైమవతి కు అందజేయడం జరిగింది.

ముగ్గురు మైనర్ పిల్లల పై లక్ష ముప్పై మూడు వేయుల మూడు వందల ఒక్కో కరికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. శేఖర్ బార్య, పిల్లల యోగ క్షేమము అడిగి, ఎప్పుడు ఏమి సమస్య వచ్చిన మేము ఉన్నామని సిపి గారు బరోసా కల్పించారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పని చేసి సిబ్బంది 30 సంవత్సరాలు పై బడిన వారందరూ బీపీ, షుగర్ చెకప్ చేసుకోవాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో డీసీపీ అడ్మిన్ పి. ఇందిర, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు భద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking