Take a fresh look at your lifestyle.

భూమి సమస్య పరిష్కారించారని పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు

0 285

వరంగల్ కమిషనర్ AV రంగనాథ్,

ఎం.ఎల్.సి కడియం శ్రీహరి లకు

పాలాభిషేకం చేసిన దివ్యాంగుడు..

వరంగల్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు(మూగ) నోముల వేణు గోపాల్ రెడ్డి తనకు న్యాయం చేశారని వరంగల్ కమీషనర్ ఎవి రంగనాథ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలకు పాలభిషేకం చేశారు. 

30 గంటల వ్యవసాయ భూమీ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వారి పొరుగు వారితో భూవివాదం సమస్యతో  సతమతమవుతున్నారు ఆ కుటుంభీకులు. ఈ భూవివాదంపై ఎన్నో సార్లు పంచాయితీలు నిర్వహించిన వారి సమస్యకు పరిష్కారం లభించలేదు.

భూసమస్య పరిష్కారం కొరకై వారి కుటుంబ సభ్యులు ఎం.ఎల్.సి కడియం శ్రీహరి గారిని సంప్రదించగా ఆయన  వరంగల్ కమిషనర్ A.V రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యను పరిష్కరించారు.  ఆ సంతోషంతో న్యాయం చేసిన ఆ ఇద్దరికి పాలాభిషేకం చేశారు దివ్యాంగుడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking