Take a fresh look at your lifestyle.

102 కు పెరిగిన డయాలిసిస్ కేంద్రాలు

0 27

102 కు పెరిగిన డయాలిసిస్ కేంద్రాలు
: మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 20:  నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాంపల్లి ఏరియా హాస్పిటల్ కు చాలా మంది పేదలు వస్తారు. వారికి మరింత మెరుగైన సేవలు అందాలన్న ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విన్నపం మేరకు వీటిని ఏర్పాటు చేశాం. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఈ వ్యాధి వారిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. రోగులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది. సీఎం కెసిఆర్ ఈ సమస్యను మానవతా హృదయంతో ఆలోచించి పరిష్కారం చూపించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని ఆదేశించారని అన్నారు.

డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నాం. ఒకరి నుండి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా కార్పొరేట్ తరహాలో క్వాలిటీ సేవలు అందిస్తున్నాం. మన విధానం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్కూడా ఇస్తున్నాము. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయు. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తున్నది.

బయట చేస్తే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా( 15 వేలు విలువ చేసే )జీవిత కాలం అందిస్తున్నాము. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేసున్నాం తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఉంటే, ఇపుడు ఆ సంఖ్యను 56 కి పెంచుకున్నామని అన్నారు.

27 బ్లడ్ బ్యాంక్ లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చాము. వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు నలుగురికి వాడుతున్నాం . నగరం నలు వైపులా టిమ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గచ్చిబౌలి టిమ్స్ ను కూడా 1000 పడకలకు అప్డేట్ చేస్తున్నాం. నిమ్స్ కు అదనంగా 2000 పడకలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. వీటి ద్వారా 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి రానున్నాయి. నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నారు.

గొప్ప ప్రభుత్వాలు అని చెప్పుకొనే కాంగ్రెస్, టీడీపీలు హైదరాబాద్ లో ఒక్క ఆసుపత్రి కూడా పెట్టలేదు. బ్రిటిష్, నిజాం కాలంలో కట్టిన గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులే ఉన్నాయి. వైద్యులు సిబ్బంది కొరత లేకుండా ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతున్నాం. నాంపల్లిలో 64 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వైద్యారోగ్య రంగం దేశానికే దిక్సూచిగా నిలిచింది. ట్రామా కేర్ సెంటర్లు బలోపేతం చేస్తాం. లెవల్ 1, 2, 3 గా వర్గీకరించి బలోపేతం చేస్తున్నాం. అత్యవసర సేవలు కార్పొరేట్ తరహాలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

దేశంలో ఆసుపత్రుల్లో మెయింటినెన్స్ కోసం నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఒక్కో బెడ్ కు 7500 ఇస్తున్న ఒకే ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం. డైట్ చార్జీలను కూడా రెట్టింపు చేశాం. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు దేశంలోని మొదటిసారిగా మిడ్ వైఫరీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. నాంపల్లిలోనే 18 నెలలు శిక్షణ ఇస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ ప్రసవాలు గతంలో 30 శాతం ఉంటే ఇప్పుడు 65 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగింది అనడానికి నిదర్శనం. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ గారు 250 కోట్లు కేటాయించారు. 6.5 లక్షల మంది గర్భిణులకు వీటిని అందిస్తాం. ఒకటి రెండు వారాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించాం. మరో లక్ష సేకరిస్తున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking