Take a fresh look at your lifestyle.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

0 37

ఖమ్మం: బీఆర్‌ఎస్‌ ఖమ్మం సభలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటి వారు అని కేజ్రీవాల్‌ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు.

ఢిల్లీ, పంజాబ్‌లో ‍కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతం. కంటి వెలుగు కార్యక్రమం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సింగపూర్‌, జపాన్‌ కన్నా మనం ఎందుకు వెనుకపడ్డాము.

ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్‌ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి మొహల్లా క్లినిక్‌లను చూశారు. తెలంగాణ గవర్నర్‌.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్‌ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. గవర్నర్లు కేవలం కీలుబొమ్మలు మాత్రమే. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking