Take a fresh look at your lifestyle.

పాకిస్థాన్ లో దారుణం.. కాల్చిచంపిన దుండగులు

0 15

పాకిస్థాన్ లో దారుణం

ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను

కాల్చిచంపిన దుండగులు

ఇస్లామాబాద్:, మే 5 : పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా కుర్రమ్ తహసిల్‌లోని తరి మంగళ్ ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కాల్చిచంపారు. ఆయుధాలతో పాఠశాల స్టాఫ్‌రూమ్‌లోకి దూరి ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు.

మరో ఘటన పరాచినార్ ప్రాంతంలో జరిగింది. అక్కడ మరో ఉపాధ్యాయుడిని చంపేశారు. దీంతో చనిపోయిన ఉపాధ్యాయుల సంఖ్య 8కి పెరిగింది. పట్టపగలు ఉపాధ్యాయులను కాల్చి చంపడంతో పాకిస్థాన్‌లో కలకలం రేగింది. ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు

Leave A Reply

Your email address will not be published.

Breaking