కంటోన్మెంట్ లో నివేదిత పోటి
సికింద్రాబాద్..
కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య సోదరి నివేదిత మీడియా సమావేశం నిర్వహించారు. నివేదిత మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నా సోదరి లాస్య నందిత మరణం బాధాకరం. సంవత్సరంలోపు నాన్న, చెల్లి దూరమవ్వడంతో తెరుకోలేక పోతున్నాం.
నాయకులు, ప్రజల అభీష్టం మేరకు పోటీలో ఉంటున్నాను. రాబోయే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున బరిలో ఉంటాను. త్వరలోనే కేసీఆర్ ను కలిసి పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తాను. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశనంతరం ఉప ఎన్నికలో బరిలో ఉండనున్నట్లు వెల్లడించారు. అన్ని పార్టీలు ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని నేతలు విజ్ఞప్తి చేసారు.