Take a fresh look at your lifestyle.

ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో

0 110

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో సానియా మీర్జా-రోహన్‌ బోపన్న (భారత్‌) జోడి గెలిచింది. బుధవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో థర్డ్‌ సీడ్‌ ద్వయం నీల్‌ స్కుప్స్కి(గ్రేట్‌ బ్రిటన్‌), డిసిరే(యూఎస్‌ఏ)ను 7-6, 6-7, (10-6) తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఆస్ట్రేలియా జోడి ఓలివియా గడెస్కీ- మార్క్ పొల్మన్స్, బ్రెజిల్ జోడి లూక్రెజియా సెఫనిని- రాఫెల్ మాటోస్ మధ్య రెండో మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జోడితో శనివారం మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సానియా మీర్జా – రోహాన్ బోపన్న జోడి తలబడుతుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking