Take a fresh look at your lifestyle.

బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్ గూటికే..?

0 13

బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్ గూటికే జూపల్లి, పొంగులేటీ ?

హైదరాబాద్, మే 30 : తెలంగాణ సీనియర్ రాజకీయ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారన్నదానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ నిర్వహించారు. గన్‌మెన్లను కూడా తీసుకెళ్లకుండా ఈటల జూపల్లి, పొంగులేటితో ఏం చర్చించా రనన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఇద్ద‌రిని హ‌స్తం గూటికి చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసింది..

దీంతో ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌ల్ల‌గుల్ల‌లు ప‌డుతున్నారు. అసెంబ్లి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసం తృప్తి నేతలే టార్గెట్‌గా ఆ పార్టీ ప్రయ త్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీ యాల్లో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా బీజేపీలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే బీజేపీలో చేరే విషయమై పొంగులేటి, జూపల్లి తేల్చకపో వడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది.

వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతోంది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకు పొంగులేటి, జూపల్లితో ఈటల సమావేశం అయినట్లుగా చెబుతున్నారు. అలా అయితే అందులో రహస్యం ఎందుకని కొంత మంది డౌట్. పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ పెట్టబోతున్నా రని, ఆ క్రమంలోనే ఈటల వారితో రహస్య భేటీ జరిపినట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త నేతల చేరికలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. కొత్త నేతల చేరడం అటుంచితే పార్టీ లో ఉన్న నేతలు కూడా చేజారే ప్రమాదముందన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

ఈటలపై బీజేపీ శ్రేణుల్లోనే అనుమానాలు నెల కొనడంతో పొంగులేటి, జూపల్లితో జరిగిన చర్చల్లో వారిని బీజేపీకి ఆహ్వానించే అంశాన్ని చర్చించారా..? లేక బీజేపీలోకి రావడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో పరోక్షంగా ప్రయోజనం కలిగించే ప్రత్యామ్న్యాయాలపై ఈటల వారితో చర్చించారా..? అని కొంత మంది బీజేపీ రాష్ట్ర నేతలు అనుమానపడుతున్నతమ నిర్ణయాన్ని పొంగులేటి, జూపల్లి ప్రకటించకపోవడంతో వారి రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఉమ్మడి శత్రువైన బీఆర్‌ఎస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించడాని బీజేపీ దగ్గరున్న వ్యూహాలు, తెలంగాణలో బీజేపనీకి ఉన్న బలం, ప్రజల్లో ఆదరణ, ఎన్ని సీట్లలో గెలుపు సాధ్యం తదితర అంశాలపై పొంగులేటి, జూపల్లి కి అనుమానాలున్నాయి. కాంగ్రెస్ కు గ్రామ గ్రామాన క్యాడర్ ఉండటంతో పాటు కర్ణాటక ఎన్నికల తర్వాత ఓ వేవ్ వచ్చింది. ఈ కారణంగా ఆ పార్టీ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.రేవంత్ రెడ్డి వారు వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈటెల నిర్వేదం

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని.. బిజెపి రాష్ట్ర చేరిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ ,హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు..హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సంసందర్భంగా ఆయన వారితో చర్చల గురించి వివరించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల చెప్పుకొచ్చారు.

దీంతో పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌యింది..బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుని.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆకర్షిస్తున్నాయి. ఖమ్మంలో కాస్తో కూస్తో బలం ఉన్న ఆ ఇద్దరిని తమ జట్టులో కలుపుకోడానికి ఉబలాటపడుతున్నాయి. అయితే బీజేపీ నుంచి ఈటల ఓ అడుగు ముందుకేశారు. నేరుగా తానే వెళ్లి రెండుసార్లు వారిద్దరితో చర్చించారు.

కానీ వర్కవుట్ కావడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేక ఫలితం రావడంతో ఇక బీజేపీలో చేరిక గురించి మర్చిపోయారు. ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి , జూపల్లి అడుగులు కూడా పడుతున్నాయన్న ప్రచారం జరిగింది.,

కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని అనుకున్నారు. అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking