Take a fresh look at your lifestyle.

జనసైనికులకు ప్రమాద బీమా

0 37

జనసైనికులకు ప్రమాద బీమా

మదనపల్లె : జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు రామదాస్ చౌదరి తెలియజేశారు. నేడు మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు జంగాల శివరాం, సురేంద్ర, సూరి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా వుండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ నెల పదో తేదీ నుండి 28వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking