Take a fresh look at your lifestyle.

ఖమ్మం రైల్వే స్టేషన్ లో ప్రమాదం

0 16

ఖమ్మం రైల్వే స్టేషన్ లో ప్రమాదం

ఖమ్మం, జూన్ 1 : ట్రైన్ ఎక్కే సమయములో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో జారీ ఫ్లాట్ ఫామ్ కి ట్రైన్ కు మద్యలో ఇరుక్కుపోయిందో మహిళ. మధిర కు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వర రావు అతని భార్య కల్యాణి ఖమ్మం లోని ఓ ఆసుపత్రికి చెకప్ కోసం వచ్చారు.

ఆసుపత్రిలో చెకప్ అనంతరం మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా ట్రైన్ కడలడముతో ట్రైన్ కు ఫ్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్క పోవడం వల్ల ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

అతి కష్టం మీద బయటకు తీసిన సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking