Take a fresh look at your lifestyle.

120 అడుగుల ఫ్లాగ్ పోస్టు ను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0 14

120 అడుగుల ఫ్లాగ్ పోస్టు ను
ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నిర్దేశం, హైదరాబాద్
బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటుచేసిన 120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆవిష్కరించారు. 1948 లో హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం అయిన సందర్భంగా ఇక్కడే నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజాం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వంచే నియమితులైన ఎంకే వెల్లోడి i బాధ్యతలు స్వీకరిస్తూ, 120 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు.


దాని స్థానంలో అదే విధంగా నూతనంగా నమూనాను రాష్ట్రపతి ప్రారంభించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌండేషన్ ను కుడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking