Take a fresh look at your lifestyle.

సహస్ర జ్వాలతోరణ ఉత్సవం

0 60

పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలోజ్వాలా తోరణం అనే ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున ఘనంగా నిర్వహించారు-మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో కార్తీకమాసంలో పౌర్ణమి రోజున సహస్ర జ్వాలాతోరణం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తోరణాన్ని దేవాలయ కమిటీ మెంబర్లు వెలిగించి తరువాత ఆ వెలుగుతున్న తోరణంలో రంగనాథుని సతీ సమేతంగా మూడు ప్రదక్షిణలు చేశారు. తోరణాన్ని 20 కేజీల తో ఎంతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి కావలసిన వస్తువులన్నీ ఆలయ కమిటీ మెంబరు కారుమంచి శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకపౌర్ణమి రోజున ఇలా చేస్తే తెలిసి చేసినా తెలియక చేసినా సర్వ పాపాలలు హరించుకుపోతాయి.ప్రజా నేత్రరిపోర్టర్ వీరేష్.

Leave A Reply

Your email address will not be published.

Breaking