Take a fresh look at your lifestyle.

మహిళలు అనే గౌరవం బీఆర్ఎస్ పార్టీకి లేదు

0 287

జాతీయమహిళ కమిషన్ కు కలిసిన వైఎస్ షర్మిల

న్యూఢిల్లీ, మార్చి 15 : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బుధవారం ఉదయం జాతీయ మహిళ కమీషన్ ను కలిసారు. బీఆర్ఎస్ నేతలపై మహిళ కమీషన్ కు పిర్యాదు చేసారు. అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళ కమీషన్ ముందు పెట్టారు.  

షర్మిల మాట్లాడుతూ మహిళలు అనే గౌరవం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న నాపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. పబ్లిక్ గానే ఎలా బయట తిరుగుతావో చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు.

తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు,రక్షణ లేదు.కేసీఅర్ కొడుకు కేటీఆర్ ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటాడు. మహిళలు అంటే ఒక మత్రికి మరదలు తో సమానం అంట. ఒక ఎమ్మెల్యే అయితే  మహిళా అని చూడకుండా కొజ్జా అని అంటున్నాడు.

ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. వైఎస్ షర్మిల ఇచ్చిన పిర్యాదు పై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మసానుకూలంగా స్పందించారు. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking