Take a fresh look at your lifestyle.

పిఎంను అగౌరవ పరుస్తుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు?

0 77

ప్రధాని గౌరవాన్ని మంటకలుపుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు?

మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి?

నిరుద్యోగ భ్రుతి, ఫ్రీ యూరియా హామీలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు?

నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచి వేస్తాం

బరాబర్ సచివాలయ డోమ్ లను కూల్చివేస్తాం

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం

పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం… రైతులకు పంట పరిహారం చెల్లిస్తాం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు.

జగిత్యాల్ జిల్లా :  తెలంగాణలో చేసిన అభివ్రుద్ది, ప్రజలకు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సభా సాంప్రదాయం కాదని, అయినప్పటికీ ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల్ జిల్లా కోరుట్ల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ కేసీఆర్ పై మండి పడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగ భ్రుతి, ఫ్రీ యూరియా సహా ఇచ్చిన హామీలపై కేసీఆర్ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏసీడీ ఛార్జీల విషయంలో కేసీఆర్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలపై ఏసీడీ ఛార్జీల భారం మోపిన కేసీఆర్ ఎంఐఎం నేతలకు భయపడి పాతబస్తీలో ఏసీడీ ఛార్జీల ఊసే ఎత్తలేదన్నారు.

తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం? పాతబస్తీకి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల కరెంట్ చౌర్యం జరుగుతోందని, నిరూపించేందుకు తాను సిద్దమని ప్రకటించారు. సీఎం కేసీఆర్, ఎంఐఎం నేతలకు చేతనైతే విద్యుత్ శాఖ లెక్కలు తెప్పించుకుని చూడాలని సూచించారు. సచివాలయాన్ని ధ్వంసం చేసినోళ్లే కూల్చే సంస్క్రుతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న బండి సంజయ్ నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచి వేస్తామని, బరాబర్ సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు.

జనం గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ’కు బండి సంజయ్ హాజరై ప్రసంగించారు.

సచివాలయం కూల్చినోళ్లే… ఇయాళ కూల్చే సంస్క్రుతి గురించి నీతులు చెబుతున్నారు. అందులో ఉన్న పోచమ్మ తల్లి గుడిని కూల్చిన మూర్ఖుడెవరు? తెలంగాణ ప్రజలను నరకయాతన పెట్టిన నిజాం ఆనవాళ్లను సచివాలయానికి పెడుతున్నరు. తాజ్ మహల్ వంటి సమాదితో పోలుస్తున్న సచివాలయాన్ని అట్లనే ఉంచుదామా? బరాబర్ సచివాలయం డోమ్ లను కూల్చివేస్తాం… తెలంగాణ సంస్క్రతి, భారతీయ సంస్క్రతి ఉట్టిపడేలా కడతాం… ఎట్టి పరిస్థితుల్లో నిజాం వారసత్వాన్ని, నిజాం నెత్తుటి మరకలను పూర్తిగా తుడిచి వేస్తాం అన్నారు బండి సంజయ్ కుమార్.

ఉస్మానియా ఆసుపత్రిలో కూలే స్థితిలో ఉంది.. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిని కూల్చడం లేదు. డోమ్ లు ఉన్నయని కూల్చడానికే భయపడుతున్నడు. నిజాం వారసత్వాన్ని చూపడానికే ఇదంతా… ఆసుపత్రి కట్టడం చేతగాని కేసీఆర్ వంద రూములతో ప్రగతి భవన్ కట్టుకున్నడు. పేదలకు ఇండ్లు కట్టడం లేదని ప్రశ్నించారు ఆయన.

• రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులారా…. ఆలోచించండగి. అర్హులైన ఎంతోమంది అధికారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నడు. మీ అర్హత, గౌరవ మర్యాదలను తుంగలో తొక్కుతున్నడు. ఇంకా చూస్తూ ఊరుకుంటే… మిమ్ముల్ని కనీసం మనుషులుగా కూడా చూడరు.. బానిసలకంటే హీనంగా చూస్తారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరుతున్నా.

Leave A Reply

Your email address will not be published.

Breaking