Take a fresh look at your lifestyle.

సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల విజయ దుందుభి

0 12

సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల విజయ దుందుభి

నిర్దేశం, నిజామాబాద్ :

విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ లాబ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్ పల్లి పి. యన్. యం. హైస్కూల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీలలో సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రథమ, ఇద్దరు విద్యార్థులు ద్వితీయ స్థానంతో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచి విజయదుందుభి మ్రోగించారు.
ఏడుగురు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన బహుమతులు అందుకోవడం విశేషం. అబాకస్ వివిధ విభాగాలలో వి. సాద్వి (జూనియర్ లెవెల్ 1 విజువలైజెషన్ ) టి. శివాని (జూనియర్ లెవెల్ 3), కె.అనణ్య పాటిల్ (సీనియర్ లెవెల్ 3) మరియు వేదిక్ మ్యాథ్స్ వివిధ విభాగాలలో పి.యశ్వంత్ (వాల్యూమ్ 1), పి. నవ్యశ్రీ (వాల్యూమ్ 2) రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించగా, అబాకస్ లో యన్. కార్తీక (సీనియర్ లెవెల్ 2), వేదిక్ మ్యాథ్స్ లో వి. వైశ్విక (వాల్యూమ్ 3) రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో విశ్వం సి.ఈ.ఓ. హరిచరణ్ ప్రతినిధులు మారుతి, వినాయక్, శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి, పూజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking