Take a fresh look at your lifestyle.

ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాక

0 206

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం అమలు పై అధ్యయనం కోసం

ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాక.

తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ఎంతో లాభదాయకంగా ఉందని తెలుసుకున్న ఉత్తరాఖండ్ అధికారులు తెలంగాణలో ఆధ్యాయనం చేయనున్నారు.

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో భాగంగా ఆ పథకం యొక్క పనితీరు మరియు వాటిని పొందుకున్న లబ్ధిదారుల యొక్క కుటుంబాల ఆదాయ స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం  నిర్ణయించింది.

ఆ రాష్ట్ర పశు సం. శాఖ అధికారులను గొర్రెలు మరియు ఉన్ని అభివృద్ధి బోర్డు జే.డి డా.నీత్వాల్ ఆర్ఎస్ గారు,షీప్& గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్ గారు,షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ సక్సేన గార్లను తెలంగాణకు పంపించడం జరిగింది.

గతంలో కర్ణాటక ,మహారాష్ట్ర అధికారిక బృందం గొర్రెల పంపిణి పై అద్యయనం కోసం తెలంగాణ కు వచ్చారని నేడు ఉత్తరాఖండ్ బృందం రావటం సీయం కెసీఆర్ గారి విజినరీ లీడర్ షిప్ లో నేను పనిచేయటం సంతోషం కలిగిస్తూందని చైర్మన్ డా.దూదిమెట్ల పేర్కోన్నారు
గొర్రెల జనాభా మాసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఉత్తరాఖండ్ అధికారుల బృందం ప్రశంసించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking