Take a fresh look at your lifestyle.

తెలంగాణను గ్లోబల్ టూరిజం.. డెస్టినేష‌న్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

తెలంగాణను గ్లోబల్ టూరిజం.. డెస్టినేష‌న్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌ : మంత్రి జూప‌ల్లి

0 287

తెలంగాణను గ్లోబల్ టూరిజం..

డెస్టినేష‌న్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

: మంత్రి జూప‌ల్లి

నిర్దేశం, హైద‌రాబాద్ : ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచే తెలంగాణ ను డెస్టినేష‌న్ వెడ్డింగ్ సెంట‌ర్ గా తీర్చిదిద్దుతామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం బేగంపేట లోని హోట‌ల్ హ‌రిత ప్లాజాలో ప‌ర్యాట‌క శాఖ స‌హ‌కారంతో తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (TCEI) ఆద్వ‌ర్యంలో 3వ సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లాన‌ర్స్ కాంగ్రెస్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం వివాహా వేడుక‌లకు గ‌మ్య‌స్థానంగా ఉన్న‌ప్ప‌టికి హైద‌రాబాద్, దాని చుట్టు ప‌క్క‌లా ఫంక్ష‌న్ హాల్స్, క‌న్వ‌నేష‌న్ సెంట‌ర్లు, రిసార్టుల్లో మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు. హైదరాబాద్‌కు ఆవల ఎన్నో సుందరమైన ప్ర‌దేశాలు, పుష్క‌ల‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని, చారిత్ర‌క ప్రాముఖ్య‌త, ప‌చ్చ‌ని కొండ‌ల న‌డుమ ఉన్న సాగ‌ర్ తీరం డెస్టినేష‌న్ వెడ్డింగ్ కు అనువైన ప్రాంతమ‌ని, అదేవిధంగా కృష్ణా న‌దీ తీరాన కొల్లాపూర్ లోని సోమ‌శిల బ్యాక్ వాట‌ర్ కూడా అద్భుత‌మైన కేంద్ర‌మ‌ని, ఈ ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాల‌నే లక్ష్యంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మెడికల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం (MICE) సహా వివిధ టూరిజం రంగాలపై దృష్టి పెట్టిన‌ట్లు వివ‌రించారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల (PPP) ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. ప‌ర్యాట‌క శాఖ అభివృద్ధితో ఆదాయం పెర‌గ‌డంతో పాటు యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను ల‌భిస్తాయ‌ని అన్నారు.

డెస్టినేష‌న్ వెడ్డింగ్ హాబ్ గా, పర్యాటక రంగానికి ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ స్థానాన్ని మరింత పటిష్టం చేయ‌డానికి ఇలాంటి కార్య‌క్ర‌మాలు దోహద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ర‌మేష్ నాయుడు, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ కె. నిఖిల‌, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, హైటెక్స్ హెడ్ శ్రీకాంత్, SIWPC క‌న్వీన‌ర్ శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ క‌న్వీన‌ర్ రామ్ కె ముప్పన, TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కో-కన్వీనర్లు హిరీష్ రెడ్డి, కుమార్ రాజా, డాక్టర్ సౌరభ్ సురేఖ‌, సుధాకర్ యరబడి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking