Take a fresh look at your lifestyle.

కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తాం : మంత్రి

0 80

1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ చేశామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. 11 లక్షల 306.38 ఎకరాలకు నిధులు విడుదల చేశామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 45 వేల 700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ చేసామన్నారు.

ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనున్నదన్నారు. ఖమ్మం సభలో కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కానున్నది. నాడు తెలంగాణ కోసం.. నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారన్నారు.

తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలని, 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్దిల్లాలి అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఆహారరంగం మీద పడిందని వివరించారు ఆయన.

కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తాం తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారు.

బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నది.అందుకే తెలంగాణ మీద కక్ష్యగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నదని, బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారన్నారు మంత్రి

 

Leave A Reply

Your email address will not be published.

Breaking