Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న జోష్..

0 24

అసెంబ్లీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న జోష్..

  • కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం

– కేసీఆర్ లా కథలు చెబుతూ ప్రజల వద్దకు..
– క్యూ న్యూస్ యూ ట్యూబ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్..
– ప్రభుత్వంపై మాటల దాడితో 70కి పైగానే కేసులు..
– కాంగ్రెస్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ..

తీన్మార్ మల్లన్న.. రాజకీయ అనుభవం ఉన్నోళ్లకు ఈ పేరు పరిచయమే. సీఎం కేసీఆర్ తన స్పీచ్ లో కథలు చెప్పినట్లే సేమ్ టు సేమ్ కథలు చెబుతుండు మల్లన్న. బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాలను కథలుగా చెబుతున్నారు అతను. అయితే.. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే స్పీచ్ లు ఇస్తున్నాడు. పదేళ్లు బీఆర్ ఎస్ ను భరించింది చాలు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

తీన్మార్ వార్తలతో సెలబ్రిటిగా..

తీన్మార్ మల్లన్న వీ6 న్యూస్ టీవీలో తెలంగాణ యాసలో వార్తలు చెబుతూ సెలబ్రిటీగా మారారు. క్యూ న్యూస్ యూ ట్యూబ్ న్యూస్ ఛానల్ ద్వారా డైలీ పేపరుల వార్త కథనాలపై తన అభిప్రాయం చెబుతూ సీఎం చంద్రశేఖర్ రావు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం వల్లే తీన్మార్ మల్లన్నకు అభిమానుల సంఖ్య పెరిగింది. క్యూ న్యూస్ ఆఫీస్ కు జనం వచ్చి తమ బాధలను చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికే అతనిపై 70 కి పైగానే కేసులు పెట్టింది ప్రభుత్వం. తీన్మార్ మల్లన్నను చాలా రోజులు జైలులో కూడా బంధించింది.

కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న..

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు తీన్మార్ మల్లన్న. అతనికి ప్రచార బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు తీన్మార్ మల్లన్న. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ తీసుకెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే.. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న తగ్గెదెలే.. అంటూ ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచారు అతను.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking