Take a fresh look at your lifestyle.

ఇండియాలో ఇంటర్నెట్‌ వినియోగదారులు ఎక్కువే..

0 15

ఇండియాలో 75 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు

న్యూఢిల్లీ, మే 5, మొబైల్ ఫోన్ వచ్చాక ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకం వీపరీతంగా పెరిగిపోయింది. ఒక్కరోజు కూడా ఇంటర్నెట్ వాడకుండా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మనదేశంలో దాదాపు 75 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్‌ వినియోగదారులు వాడుతున్నారని.. వీళ్లు కనీసం నెలకోసారైన ఇంటర్నేట్‌ను వినియోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

అయితే 2025 నాటికి ఇంటర్నెట్ వాడే వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది. అలాగే ఆ ఏడాదికి ఇంటర్నెట్ యూజర్లు 56 శాతం గ్రామీణ ప్రాంతాలకే చెందినవారు ఉంటారని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2022లో ఇంటర్నేట్ వాడే వారిలో 39 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కాగా.. 36 కోట్ల మంది పట్టణ ప్రాంతానికి చెందినట్లు పేర్కొంది.

మరో విషయం ఏంటంటే ఇంటర్నేట్ వినియోగించేవారిలో 54 శాతం పురుషులు ఉండడం కొనసాగుతుండగా.. 2022లో మాత్రం 57 శాతం మహిళలే ఉన్నట్లు తేలింది. 2025 నాటికి 65 శాతం మంది మహిళలే ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగిస్తారని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking