Take a fresh look at your lifestyle.

పాలస్తీనాలోని గాజా ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

0 18

గాజా ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి
నిర్దేశం, న్యూఢిల్లీ :
గాజాలోని హాస్పిటల్‌పై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్, హమాస్‌కి జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా సాధారణ పౌరులు నలిగిపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. “గాజాలోని అల్‌ అహ్లీ హాస్పిటల్‌పై జరిగిన దాడి ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢన సానుభూతి తెలుపుతున్నాను. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయేల్, హమాస్‌కి జరుగుతున్న యుద్ధంలో సామాన్య పౌరులు నలిగిపోతున్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఈ దాడులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు” అన్నారు ప్రధాని మోదీ.

Leave A Reply

Your email address will not be published.

Breaking