Take a fresh look at your lifestyle.

నిధుల కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే

0 14

ఉద్దేశ్యపూర్వకంగా నిధులు ఇవ్వడం లేదు

ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే.. ప్రజల ఓట్లతో గెలిసిన ప్రజాప్రతినిధులు ఇందుకు మినహింపు కాదు. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పక్షాలను పక్కన పెట్టి నిధుల మంజూరిలో నిర్లక్ష్యం చేస్తోందని ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు దుబ్బాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు.

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులను దుబ్బాక నియోజక వర్గంకు కేటాయించక పోవడంపై ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేసారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది.

స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ను కేవలం సిద్దిపేట , గజ్వేల్ కు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు రఘునందన్ రావు. ఉద్దేశ్యపూర్వకంగా  ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్న రఘునందన్ రాావు.

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, GAD ముఖ్యకార్యదర్శి , సిద్దిపేట , మెదక్ కలెక్టర్లు, R&B అధికారులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking