Take a fresh look at your lifestyle.

పరీక్ష్ పేపర్ లీకేజీ కేసులో సీఎం ముఖం చాటేస్తున్నారు

0 49

పరీక్ష్ పేపర్ లీకేజీ కేసులో సీఎం ముఖం చాటేస్తున్నారు

సిట్ నిందితులను భద్రంగా కాపాడుతుంది

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 20 : పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ కేసులో నెల రోజులు గడిచినా కేసులో పురోగతి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి లీకేజీ అంశంపై ముఖం చాటేస్తున్నారని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కేసులో సిట్ అధికారులు 18 మంది నిందితులను అరెస్టు చేసినట్టే చేసి, వారికి ఏం కాకుండా భద్రంగా పూవుల్లో పెట్టి చూసుకుంటున్నారని విమర్శించారు.

లీకేజీ కేసులోని నిందితులపై పిడి యాక్టు కింద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని నిలదీశారు ఆయన. గ్రూప్ 1 పేపర్ లీకేజీ మీద ప్రత్యేక కేసును ఎందుకు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్. బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసన్నల్లో పనిచేసే సిట్ పనిచేయలేక కూలబడిందని ఎద్దేవా చేశారు ప్రవీణ్ కుమార్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాసి రెండేళ్లు దాటినా ఫలితాలు ఇవ్వకపోవడంతో, విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోతుందని దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఈ విద్యార్థులు తమ సమస్యలపై ముఖ్యమంత్రిని కలుద్దామంటే, కార్యాలయంలోనికి విద్యార్థులకు అనుమతి లభించడం లేదని ఆరోపించారు. కనీసం విద్యాశాఖ మంత్రి అయినా పట్టించుకోవాలని డిమాండ్ చేశారు ఆయన.

ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ నియామకాల్లో సింగిల్ పిజి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం హైకోర్టుకు వెళ్లిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇచ్చి, మిగతా అభ్యర్థులకు అర్హత లేదనడం అన్యాయం అన్నారు. విద్యాశాఖ మంత్రి స్పందించి సింగిల్ పిజి చేసిన అభ్యర్థులందరికీ నోటిఫికేషన్ లో అర్హత కల్పించి పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking