Take a fresh look at your lifestyle.

భోపాల్ కేంద్రంగా ఉగ్రవాదుల కుట్ర

0 16

భోపాల్ కేంద్రంగా ఉగ్రవాదుల కుట్ర

ఆత్మహుతి సభ్యులను తయారు చేయడానికి వ్యూహం

హైదరాబాద్, మే 22 : భోపాల్ – హైదరాబాద్ ఉగ్ర కోణం లో బయట పడుతున్న నిజాలు. ఏటీఎస్ పోలీస్ ల కస్టడీ లో కీలక విషయాలు చెబుతున్న నిందితులు. హైదరాబాద్- భోపాల్ యువకులకు ఉగ్రవాదులుగా మార్చడానికి శిక్షణ ఇచ్చిన జిమ్ ట్రైనర్ యసిర్. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్ యూ టీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు ఏటీఎస్ పోలీస్ అధికారులు. యువకులకు ఫిధాయీ దళాల పేరుతో శిక్షణ ఇచ్చినట్లు గుర్తించిన అధఇకారులు. హెచ్ యూ టీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని గుర్తించిన ATS అధికారులు.

16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం. భోపాల్ లోని భోజ్ పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్రకర్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తిస్తున్న అధికారులు. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియో లు.. కోడ్ భాషలో వున్న 50 కి పైగా ఆడియో లు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోని శాంతి ద్వీపం పెల్చేయలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేసారు.

శాంతి ద్వీపం పేల్చడం అంటే బాంబు పేలుళ్ళు జరపడం అని గుర్తించిన ATS అధికారులు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం , బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు అధికారులు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గం లో నిధులు వచ్చినట్టు గుర్తించింది ATS టీమ్. సకాలంలో ఉగ్రమూకల సమాచారంతో ఊపీరి పీల్చుకుంటున్న అధికారులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking