Take a fresh look at your lifestyle.

తెలంగాణ రన్ ను విజయవంతం చేయాలి : సీఎస్

0 17

తెలంగాణ రన్ ను విజయవంతం చేయాలి
: సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, జూన్ 8 :: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తేదీన నిర్వహించే తెలంగాణా రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కోరారు. తెలంగాణ రన్ నిర్వహణపై నేడు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్ తో సహా పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, హైదరాబాద్ లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని మైదానం నుండి జరిగే 2 కె, 4 కె రన్ లను ప్రధానంగా నిర్వహిస్తున్నామని, ఈ రన్ లో కనీసం నాలుగు వేల మంది రన్నర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. నగరంలోని యువత, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, పోలీసులు పాల్గొంటారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ రన్ లలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సి.ఎస్. విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజి రమేష్ రెడ్డి, అడిషనల్ సీపీ లు విక్రమ్ సింగ్ మాన్, సుధీర్ బాబు తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking