Take a fresh look at your lifestyle.

మానస విద్యార్థుల ప్రతిభ

0 44

సైనిక్ స్కూల్ కు ఎంపికైన మానస విద్యార్థులు

జగిత్యాల, ఫిబ్రవరి 25 : అల్ ఇండియా స్థాయిలో జరిగిన సైనిక్ స్కూల్ అర్హత పరీక్షలో మానస స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ రజితా రావు పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో అల్ ఇండియా స్థాయిలో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్ష జరిగిందని ఇందులో వేలాది మంది విద్యార్థులు సీటు కోసం గతనేల అర్హత పరీక్ష రాశారన్నారు. మానస స్కూల్ నుంచి మ్యాకల సుహాన్ (261/300), రాగిల్ల విశ్వతేజ (256/300) రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ఇది జగిత్యాల జిల్లాలో ప్రభంజనం రజితా రావు పేర్కొన్నారు. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన మ్యాకల సుహాన్, రాగిల్ల విశ్వతేజలను ప్రిన్సిపాల్ రజితా రావు, డైరెక్టర్లు బి.శ్రీధర్ రావు, బి.హరిచరన్ రావు, జే. మౌనికా రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking