Take a fresh look at your lifestyle.

పైరవీ బదిలీలు ఆపాలి : యుయస్పీసి డిమాండ్

0 55

 జీరో సర్వీసు బదిలీలకు అనుమతి ఇవ్వాలి.
13 జిల్లాల స్పౌజ్ కేసులు బదిలీలకు ముందే పరిష్కరించాలి
యుయస్పీసి డిమాండ్
ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదలైందో లేదో పైరవీ బదిలీల ప్రహసనం మొదలైంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లోని పట్టణ ప్రాంత పాఠశాలలకు సచివాలయం నుండి నేరుగా బదిలీ ఉత్తర్వులు ఇస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు.

రాజకీయ పలుకుబడితో జరుగుతున్న పైరవీ బదిలీలు నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) డిమాండ్ చేస్తోంది. సాధారణ బదిలీల్లో జీరో సర్వీసుతో ఉపాధ్యాయులు అందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోకుండా రెండు సంవత్సరాల కనీస సర్వీసుగా జిఓ ఇచ్చారు.

బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ కేసులను బదిలీలకు ముందే సర్దుబాటు చేయాల్సి ఉండగా ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ సమస్యలు కొందరు ఉపాధ్యాయులలో అసంతృప్తికి కారణమౌతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి హామీ ఇచ్చిన విధంగా పై సమస్యలను పరిష్కరించాలని, పైరవీ బదిలీలు నిలివేసి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking