Take a fresh look at your lifestyle.

అభివృద్దిపై అధికార పక్షనేతలతో బహిరంగ చర్చకు సిద్దం

0 14

అభివృద్దిపై అధికార పక్షనేతలతో బహిరంగ చర్చకు సిద్దం

: కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్

మేడ్చల్, మే 18 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ చేపట్టిన హాత్ సే హాథ్ జోడో యాత్ర ఈరోజుతో 54 రోజులు కావడంతో ముగింపు సభ ను నియోజకవర్గ బూతు స్థాయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ నేతలకు అధికారులు తొత్తులుగా మారి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై దృష్టి సాధించకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జిహెచ్ఎంసిని ముట్టడిస్తామని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తెలిపారు.

నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి రమ్మన్నా వస్తామని బహిరంగ చర్చకు సిద్ధమని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కెసిఆర్ సర్కార్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని, దళిత బంధువు పథకమును ప్రతి దళితునికి చెందే విధంగా చూడాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేస్తానని ఆడపడుచులకు గ్యాస్ 500 కే వచ్చే విధంగా, యువకులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking