Take a fresh look at your lifestyle.

రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టులో చుక్కెదురు

0 33

రాహుల్ గాంధీ కి గుజరాత్‌లోని

సూరత్ కోర్టులో చుక్కెదురు

సూరత్ ఏప్రిల్ 20 :  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరు గలవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా తీర్పు చెప్పడంపై ఆయన చేసిన అపీలును సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తిరస్కరించింది. క్రింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలని ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు.

ఆయన అపీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు గురువారం వెలువడింది.రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అపీలును అనుమతించినట్లయితే, ఆయనకు విధించిన శిక్ష, దోషిత్వ తీర్పును సస్పెండ్ చేసి ఉంటే, ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఉండేది.

Leave A Reply

Your email address will not be published.

Breaking