Take a fresh look at your lifestyle.

ఓబీసీ రిజర్వేషన్ల పరిమితిపై మోడీకి రాహుల్​ ఛాలెంజ్​

0 49

ఓబీసీ రిజర్వేషన్ల పరిమితిపై

మోడీకి రాహుల్​ ఛాలెంజ్​

కర్నాటక కొల్లార్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ కీలక ప్రకటన

బెంగుళూర్, ఏప్రిల్ 16 : ఓబీసీ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై బీజేపీ నేతృత్వంలోని పీఎం మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్​ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్​ గాంధీ ఛాలెంజ్​ విసిరారు. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్​ చేశారు.

ఆదివారం కర్నాటకలోని కొల్లార్​ ఎన్నికల ప్రచార సభలో రాహుల్​ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీ జనాభా లెక్కలను మోడీ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు తమ జనాభా శాతం ఎంతో యావత్​ దేశ ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాహుల్ గాంధీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎజెండాను నిర్దేశించినట్టయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ప్రధానికి నిజమైన శ్రద్ధ ఉంటే, ఆ వివరాలను విడుదల చేసి కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ వెల్లడడించారు. లేని పక్షంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలను ప్రధాని మోడీ అవమానించినట్లే అవుతుందని రాహుల్​ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking