Take a fresh look at your lifestyle.

తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీలు

0 262

ఈ నెల 27 నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీలు

ఈనెల 27 నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీలు, పదోన్నతులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవ సేన, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

ఈనెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking