Take a fresh look at your lifestyle.

టీటీడీ వారిచే పట్టు వస్త్రాల సమర్పణ

0 172

టీటీడీ వారిచే శ్రీశైలం అమ్మవార్లకు  పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ స్వామి అమ్మవార్లకు జేఈఓ వీరబ్రహ్మం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం ఈఓ ఎస్. లవన్న, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు ఆ దేవస్థానం అధికారులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు సతీమణి స్వర్ణలత, అర్చకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking